ఇపుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో ఓవర్ఎక్స్పోజింగ్ చేయించడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఒకప్పుడు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఎక్స్పోజింగ్ చేసి కూర్రాళ్ల గుండెల్లో కాక రేపిన హీరోయిన్లు ఉన్నారు. అందులో ప్రియమణి ఒకరు. సౌత్ సినిమాల్లో ప్రియమణికి, ఆమె అందానికి ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాలు, చూపిన సెగలు అలాంటివి మరి. ‘ఎవరే అతగాడు’ చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చినా ప్రియమణి అంటే పెద్దగా తెలియదు. కానీ ‘పెళ్లైయిన కొత్తలో’ చిత్రంతో జగపతిబాబు సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
నటనతో పాటు పొదుపైన ఆచ్ఛాదనలతో సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. సినిమాల్లో భారీ ఎక్స్పోజింగ్ చేయడానికి, అనవసరమైనప్పుడు బికినీ షోలు చేయడానికి ప్రయమణి అప్పట్లో ఏ మాత్రం వెనకాడలేదు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోల చెంత కూడా ఆడిపాడింది. ఇక సినిమాల్లో ఆమె అందాలు చూసిన ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేరు అన్నంతగా మైమరపించింది. అలాగే హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు మతానికి అతీతంగా ముస్తఫా అనే ముస్లిం యువకుడిని పెళ్లాడింది ప్రియమణి.
అయితే ఈ ఇద్దరివీ వేరు వేరు మతాలైనప్పటికీ ఒకరి మతం పట్ల మరొకరు పాజిటివ్ గా ఉంటూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఇక ముస్లిం యువకుడిని పెళ్లాడిన ప్రియమణి ఆ తరువాత సినిమాకు కాస్త దూరంగా ఉంది. మరియు ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమెకు మళ్లీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించనుందని సమాచారం. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధనుష్ పాత్రని వెంకటేష్, మంజువారియర్ పోషించిన పచ్చయమ్మాల్ పాత్రని ప్రియమణి చేయనుందని టాక్ వినిపిస్తోంది.