కరోనా సమస్యతో ఇప్పుడు సెలిబ్రిటీల దగ్గర నుండి సామాన్యుల వరకు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ జీవితంలోని మాధుర్యాలను ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకప్పుడు సమిష్టి కుటుంబాలకు చిరునామాగా ఉండే భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని ఇప్పుడు కరోనా వచ్చి నేటి తరానికి పరోక్షంగా గుర్తు చేస్తోంది అంటూ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఈమధ్య కామెంట్ కూడ చేసారు. ఇలాంటి పరిస్థితులలో మెగా కుటుంబంలో ఇప్పటి వరకు బయటపడని ఒక రహస్యాన్ని కరోనా బయటపెట్టింది అంటూ ఇప్పుడు గాసిప్పులు గుప్పుమంటున్నాయి. 


ఇక ఆసక్తి కలిగించే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సమిష్టి కుటుంబాలకు చిరునామాగా పేర్కొనే మెగా ఫ్యామిలీ గురించిన వార్తను అనుకోకుండా కరోనా బయటపెట్టింది. చరణ్ ఉపాసనతో పెళ్లి అయిన తర్వాత కూడా చిరంజీవి వద్దే ఉంటున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఉపాసన కూడ చిరంజీవిని తన మామగారి లా కాకుండా తన తండ్రిలా ఎంతో గౌరవిస్తుంది. అయితే ఇప్పుడు చరణ్ చిరంజీవితో కలిసి ఉండకుండా వేరే ఇంటికి మారిపోయాడా అన్న సందేహాలు కలిగేలా ఈమధ్య చిరంజీవి ఇంటిలో జరిగిన ఒక సంఘటన కారణం అవుతోంది.


మొన్న ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు సెలెబ్రెటీలు అంతా ఇంటి నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టే సమయంలో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఇంటి బయటకి వచ్చి క్లాప్స్ కొట్టారు. అందులో ఆయన తల్లితో పాటు చెల్లెల్లు బావలు పిల్లలు మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఉన్నారు కానీ రామ్ చరణ్ దంపతులు మాత్రం అక్కడ కనిపించలేదు. 


అయితే చరణ్ వేరే ఇంటి నుండి బయటికి వచ్చి బాల్కనీ నుంచి చూస్తూ చప్పట్లు కొట్టాడు. దీనితో చిరంజీవి తన ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడితే చరణ్ కిందికి రాకుండా తన రూమ్ బాల్కనీ నుండి చప్పట్లు కొట్టాడా లేదంటే చిరంజీవి రామ్ చరణ్ ఇప్పుడు వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్నారా కొందరు ఆ వీడియోలను చూసి కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ఉన్న ఇంటిని తన టేస్ట్ కి తగ్గట్లుగా రామ్ చరణ్ మార్పులు చేయించాడు. దీనితో ఇన్ని మార్పులు చేసిన తరువాత చరణ్ చిరంజీవి ఇంటిలో ఉండకుండా వేరే ఇంటిలో ఉంటున్నాడు అంటూ వస్తున్న ఈ వార్తలను చరణ్ సన్నిహితులు ఖండిస్తున్నా

మరింత సమాచారం తెలుసుకోండి: