పదిహేనేళ్ళ క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో బి - గ్రేడ్ హీరోయిన్ గా కొనసాగుతూ అందరి మతి పోగొట్టింది మాళవిక. శ్రీకాంత్, వడ్డే నవీన్ లతో జత కట్టిన ఈమె తన చీర కట్టు అందాలతో కుర్రకారుని నిద్రపోకుండా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీనియర్ నటి అకస్మాత్తుగా ఇండస్ట్రీ నుండి తప్పుకున్నది. అయితే ఆమె అలా వెళ్ళిపోవడానికి గల కారణం నటకిరీటి రాజేంద్రప్రసాద్ అని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. సాక్షాత్తు ఆమె తనని రాజేంద్రప్రసాద్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని చెప్పడం సినీ వర్గాల్లో కలకలం రేపింది.



ఆమె చెప్పిన ప్రకారం... అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని ఆ సినీ డైరెక్టర్ షూట్ చేస్తున్నాడని... అయితే నటుడు రాజేంద్రప్రసాద్ ఆమెని ముద్దు పెట్టుకున్నట్టు యాక్షన్ చేయాల్సింది పోయి... ఏదో భార్య ని భర్త ముద్దు పెట్టుకున్నట్టు గట్టిగా తనని ముద్దు పెట్టుకున్నాడని, దాంతో తాను షాక్ కి గురయ్యానని, వెంటనే ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని కానీ ఆ సినీ బృందం తనకి నచ్చజెప్పారని చెప్పింది. ఆయన కూతురు వయసున్న తనతో చాలా వల్గర్ గా బిహేవ్ చేసేవాడు అని చెప్పుకొచ్చింది. కానీ ఈమె చేసే వ్యాఖ్యలన్నీ ఒట్టి అబద్ధాలని రాజేంద్రప్రసాద్ అప్పట్లో చెప్పుకొచ్చాడు.



ఏది ఏమైనా తన చీర కట్టు అందాలతో స్టార్ హీరోల సరసన అరడజను సినిమా లో నటించి ఎంతో మందిని అలరించిన మాళవిక తెలుగు ఇండస్ట్రీ నుండి కనుమరుగవ్వటం అందర్నీ బాధపెట్టింది. 2009 లో ఆమె కొన్ని తమిళ సినిమాల్లో నటించింది కానీ అవి అంతగా ఆదరణ పొందలేదు. దాంతో కోలీవుడ్ ఇండస్ట్రీ కి కూడా ఆమె గుడ్ బాయ్ చెప్పేసింది. తరువాత సురేష్ మీనన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: