హెబ్బా పటేల్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన అందచందాలతో, సెక్సీ ఫోజులతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే అతి తక్కువ కాలంలోనే యువతకు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఆడో రకం ఇడో రకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో విజయాలు అందుకుంది ఈ భామ. తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలేవీ అనుకున్న స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు.
ఉండటానికి బ్లాక్ స్కిన్టోనే అయినా, మంచి ఫిట్నెస్తో కన్పించే హెబ్బా , నాని, నితిన్, నిఖిల్, శర్వానంద్ వంటి యూత్ హీరోలకి సరిజోడి అపిపించింది. అయితే అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వల్ల వెనుకబడిపోయింది. దీంతో మొత్తం బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే ’24 కిస్సెస్’లో తన బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బా ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇక ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా `భీష్మ` చిత్రంలో హెబ్బా పటేల్ నటించి మెప్పించింది. రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తెలుగులో హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా ఎఫెక్ట్తో సినిమా విడుదల తేది వాయిదా పడింది. ఇక మరోవైపు హెబ్బా సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్గా ఉంటుంది. అందులో భాగంగా ఆమె తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్ర కారును మతిపోగొట్టేలా చేస్తుంది.