కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. కరోనా నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ప‌లువురు హీరోలు ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా కొంత విరాళాల‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడానికి సినీ, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు.

 

ఇప్పటికే కరోనా కారణంగా ప్రజలు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు పడుతున్న బాధలను చూసి ఒక్కొకరుగా మన సినీతారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన హీరోలు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో మేం ఉన్నాం అంటూ అండగా నిలుస్తున్నారు.

 

తాజాగా దగ్గుబాటు ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, సురేష్ బాబు, రానాలు తమ వంతుగా కోటి రూపాయిల సాయం ప్రకటించారు. సినీ కార్మికులు, హెల్త్ కేర్ విభాగాలకు సంబంధించిన కోటి రూపాయల సాయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విరాళంగా అందించారు. కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమలోని కార్మికులు రోజువారి అవసరాలకోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఈ సాయాన్ని ప్రకటించింది సురేష్ ప్రొడక్షన్స్.

 

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. దింతో దేశంలో లాక్ డౌన్‌ తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి దీంతో వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు అండగా నిలుస్తూ.. సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి సినిమా, హెల్త్‌కేర్ రంగాల్లోని కార్మికుల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలను స్వీయ నిర్బంధన పాటించాల్సిందిగా దగ్గుబాటి ఫ్యామిలీ కోరారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: