అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రజలకి కొత్తగా పరచియం అవసరం లేని పేరు. తెలుగు యాంకరింగ్ లో అనసూయ రాకముందు, వచ్చిన తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకంటే అనసూయ యాకరింగ్ మొదలు పుట్టకముందు కేవలం సుమ, ఝాన్సీ, ఉదయ భాను ఇలా అందరూ పూర్తిగా వాళ్ళ మాటలతో, అభినయంతో పోగ్రామ్స్ ని నడిపేవారు. ఎప్పుడైతే అనసూయ  ఆ రంగంలోకి ఎంటర్ అయ్యిందో పరిస్థితి మొత్తం మారింది. దీనికి కారణం అందరికి తెలిసినట్టుగానే అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ తెలుగు కుర్రకారులని తన తిప్పేసుకుంది వయ్యారి భామ.

 


ఇక తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో అతి కొద్దీ రోజులలో పాపులర్ స్టార్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే అనసూయ భరద్వాజ్ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా ఈ భామ అదరగొడుతోంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాతో తన నటనతో నూరు మార్కులు కొట్టేసింది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ మాయమరిపించింది. ఆ క్యారెక్టర్ ఎంతలా చేసిందంటే రంగమ్మత్తగా అనసూయను తప్పా ఇంకొకరిని  ఊహించుకోలేనంతగా.

 

 


ఇలా అటూ డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా  తనదైన శైలిలో గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే హీరో రాంచరణ్ పుట్టిన రోజు సందర్బంగా తాజాగా అనసూయ తన ట్విట్టర్ అకౌంట్‌ లో రంగస్థలం సినిమాకి సంబందించిన కొన్ని పిక్స్‌ ను ఆవిడ షేర్ చేసింది. ఆ చిత్రంలో రామ్ చరణ్‌కు గోరుముద్దలు పెడుతన్న చిత్రం ఉంది. ఈ సందర్భంగా ఆమె తాను ఏమని రాసిందంటే.. "ఓయ్ చిట్టిబాబు.. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు నువ్వులా ఉన్నందుకు.. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఆ రంగస్థలం మూవీ. ధన్యవాదాలు" అని ఆనాటి సంగతుల్నీ గర్తుచేసుకుంది. దీనితో పాటు రామ్ చరణ్‌ కు పుట్టిన రోజు విషేస్ చెబుతూ.. ఇందా బర్త్ డే బువ్వ కూడా తినై అంటూ రామ్ చరణ్‌ ను తెలుపుతూ పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: