యంగ్ హీరో నితిన్ ,తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 70 శాతం కు పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుండి రేపు సాయంత్రం 4:03 గంటలకు ఫస్ట్ లుక్ విడుదలకానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం జూలై లో విడుదలకానుంది. ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈచిత్రానికి చెక్ అనే టైటిల్ ప్రచారం లో వుంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే హ్యాట్రిక్ పరాజయాల తరువాత  నితిన్ ఇటీవల భీష్మ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, ఈ రీమేక్ ను నిర్మించనుండగా రన్బీర్ కపూర్ హీరోగా నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటివరకైతే అధికారికంగా ఎలాంటి సమాచారం వెలుబడలేదు. 
 
ఇక నితిన్ రంగ్ దే, చెక్ తరువాత మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.అందులో ఒక చిత్రాన్నివెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ తో చేయనున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధధూన్ కు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనుంది. ఈసినిమా తోపాటు కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నితిన్, పవర్ పెట్ లో నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: