టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు భామ గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో విజయ్‌ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

 

నితిన్ సరసన నటించిన 'భీష్మ' సినిమా కూడా హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలు వచ్చి పడటంతో వరుస అవకాశాలు కూడా తలుపు తట్టాయి. అయితే తన సక్సెస్ రేట్ ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే హిందీ రీమేక్ జెర్సీ లో ఛాన్స్ ను వదులుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి మంచి ఫాలోయింగ్ ఉంది.

 

డియర్ కామ్రేడ్ చిత్ర పరాజయంతో సోషల్ మీడియాలో హవా తగ్గించిన ఈ అమ్మడు రెండు వరుస బ్లాక్ బస్టర్స్ పలకరించడంతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగులు లేకపోవడంతో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి కుర్రాళ్లలో హీట్ పెంచేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: