కన్నడ బ్యూటి రష్మిక మందన్న ప్రస్తుతం బాగా రిలాక్స్ అవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో స్వీయ నిర్భంధంలో ఉంటూ చాలా కేర్ తీసుకుంటుంది. కుర్ర హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తర్వాత మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాలో నటించింది. ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో రష్మిక స్టార్ తిరిగిపోయి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఫాంలో ఉంది. 

 

నాలుగు సినిమాలకే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీపడిన ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో ఇక రష్మికని ఆపేవాళ్ళెవరూ ఉండరనుకున్నారు. రష్మిక కూడా అదే ధీమాతో ఉంది.

 

కానీ సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటి చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ దగ్గర స్టైలిష్ స్టార్ రేంజ్ ఎంతో చూపించాడు. దాంతో వెంటనే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీటయినట్టు సమాచారం. ఈ సినిమాలోనే రష్మిక నటిస్తోంది. లెక్కల మాస్టారు చేతిలోపడితే ఏ హీరోయిన్ కైనా ఒళ్ళో ఓ హిట్ పడాల్సిందే. ఇప్పుడు ఈ కన్నడ బ్యూటి కూడా అదే ఫీలవుతోందట.

 

అంతేకాదు ఈ ఉత్సాహంతో సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని షేర్ చేస్తూ సందడి చేస్తోంది. సరిలేరు సమయంలో ఫోటోస్ అలాగే భీష్మ సినిమా సమయంలో ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. అయితే కొంతమంది మాత్రం చేతిలో ఒక్క సినిమా ఉండటంతోనే ఛాన్సుల కోసం ఇలాంటి పనులు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: