బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ప్రస్తుతం అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తుంది. బ్సైజ్ జీరో, భాగమతి ఆ తర్వాత నిశ్శబ్దమ్ ఇలా అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఒప్పుకుంటుంది. నిశ్శబ్దం సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే అనుష్క మరికొద్ది రోజుల్లో హీరో పక్కన హీరోయిన్ గా నటించనుందట.

 

 

తమిళ నటుడు అజిత్ పక్కన స్క్రీన్ ని షేర్ చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఏ  మాయ చేశావే తమిల సీక్వెల్ లో అనుష్క నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఏ మాయ చేశావే తమిళ వెర్షన్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ విషయమై అనుష్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనకి మంచి ఫ్రెండ్ అని, అతనితో రెండు సినిమాలు చేస్తానని.. కానీ ఆ సినిమాలు ఏవనేది చెప్పలేనని తెలిపింది.

 

 

అయితే ఎప్పటి నుండో వస్తున్న సమాచారం ప్రకారం రెండు సినిమాల్లో ఒకటి ఏ మాయ చేశావే సీక్వెల్ ఉంటుందని మరోటి కమల్ హాసన్ తో ఉంటుందని అంటున్నారు. కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రాఘవన్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ రాఘవన్ 2 లో అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

అదే నిజమైతే అనుష్క మొదటిసారి కమల్ హాసన్ పక్కన నటించనుంది. ఇప్పటికైతే ఈ వార్తలు సోషల్ మిడియాలో చక్కర్లు కొడుతున్నవే. అధికారికంగా బయటకి వచ్చినవి కాదు. కానీ నిశ్శబ్దం చిత్రం తర్వాత అనుష్క రెగ్యులర్ హీరోయిన్ గా నటించనుందన్నది మాత్రం నిజం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: