పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని కూడ వ్యక్తిగత స్థాయిలో ఇవ్వనంత భారీ మొత్తాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ కుమార్ ప్రధానమంత్రి సహాయ నిధికి 25 కోట్ల భారీ విరాళం ఇచ్చి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని ఆశ్చర్యాన్ని కలిగించాడు. అక్షయ కుమార్ కన్నా ధనవంతుడైన బాలీవుడ్ ఖాన్ త్రియం హీరోలుకన్నా ఎక్కువ స్థాయిలో అక్షయ కుమార్ చేసిన దాతృత్వం పై మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. 


సామాజిక చైతన్యం కలిగించే సినిమాలలో నటించడమే కాకుండా తాను సినిమాలలో చెప్పే మాటలను నిజం చేయడంతో అక్షయ కుమార్ అభిమానులు కూడ అతడిని అభినందలతో ముంచెత్తి వేస్తున్నారు. అక్ష‌య్ భారీ విరాళం పై దేశమంతా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే అతడి భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన ట్వీట్ వైర‌ల్‌ గా మారింది. 


‘నా భర్త రూ.  25 కోట్లు విరాళం ఇచ్చి నేను ఎంతో గర్వపడేలా చేశారు. అయితే ఆయన ఈ విరాళం ప్రకటించే ముందు నేను కూడా ఒకసారి ఆలోచించుకోమని అన్నాను. ఇంత మొత్తం ఇస్తే.. మనకి కూడా కొంత మనీ అవసరం కదా.. అని అన్నాను’ అంటూ ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. 


అయితే అక్షయ కుమార్ మటుకు ఈ విషయం పై విభిన్నంగా స్పందించాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తన వద్ద ఒక్క రూపాయి లేదనీ ప్రజల అభిమానంతో తాను ఇన్ని కోట్లు గణించానని ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలు తనకు ఇచ్చిన డబ్బును తిరిగి ప్రజలకే ఇవ్వడం వెనుక తన గొప్పతనం ఏమిటి అంటూ అక్షయ చేసిన కామెంట్స్ ఆయన సహృదయానికి నిదర్శనం. రాజేష్ ఖన్నా అల్లుడుగా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మొదట్లో గుర్తింపు పొందిన అక్షయ్ ఆతరువాత తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకుని సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోలు ఖాన్ త్రియానికి దడ పుట్టిస్తూ తన విరాళంతో కూడ ఖాన్ త్రియానికి కూడ సవాల్ విసురుతున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: