అను ఇమ్మాన్యుయేల్...తెలుగులో నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” సినిమాతో మరో డిజాస్టర్ను అందుకుంది. తెలుగులో మరో ప్రయత్నంగా 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ద్వారా ముందుకొచ్చింది. కానీ ఈసారి కూడా పరాజయమే వెక్కిరించింది ఈ బేబీకి.
ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాలన్” తెలుగులో 'డిటెక్టివ్'గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. మంచి రేంజ్ కి వెళ్లి ధమాల్ అంటూ కింద పడిపోయింది.. పాపం. ఏదైనా అంటే హీరోయిన్ మెటీరియల్ కాదు, పెద్ద హీరోలకు సరిపోదు అంటూ డైరెక్టర్స్ అందరూ ఈ బ్యూటీని పక్కన పెడుతున్నారు. తెలుగులో వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. మన సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా..సెంటిమెంట్లకు బాగా నమ్ముతారు. అయితేనేం సోషల్ మీడియాలో అందాలను బహిర్గతం చేసే ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగోట్టేస్తోంది అను.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు నిఖిల్ హీరోగా రూపొందుతోన్న '18 పేజెస్' చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించనుందట. కొన్ని రోజుల క్రితం కృతి శెట్టి పేరు వినపడ్డప్పటికీ అను ఇమ్మాన్యుయేల్కే మేకర్స్ మొగ్గు చూపారట. ప్రస్తుతం అనుతో చర్చలు జరుపుతున్నారట. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ, మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో అయినా అను మళ్లీ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.