బుల్లి తెర హాట్ యాంకర్ అనగానే ముందుగా గుర్తువచ్చేది రంగమ్మత్త అనసూయ. ఈ భామను మరోసారి మెగా ఆఫర్ పలకరించింది.`రంగస్థలం`లో రంగమ్మత్తగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ దశలో సుకుమార్ దర్శకత్వంలో నటించిన సంగతి తెలిసిందే. రామ్చరణ్నే డామినేట్ చేసిన అనసూయకు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో నటించే మెగా ఆఫర్ దక్కినట్టు తెలిసింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ `ఆచార్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే దాదాపు యాభై శాతానికి మించి పూర్తయిన ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్ అగర్వాల్ని ఫైనల్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం కరోనా వైరస్ ఎక్కువవడంతో షూటింగ్లన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి పరిస్థితులు మారితే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక హీరోయిన్గా సెట్లో కాజల్ ఎంటర్ అవుతుందట. ఇదిలా వుంటే ఈ సినిమా కోసం రెజీనా, చిరు పాల్గొనగా ఓ స్పెషల్ సాంగ్ని ఇదివరకే షూట్ చేశారు. మరో పాటని కూడా షూట్ చేయాలనుకుంటున్నారట. ఇందులో అనసూయ నటించనున్నట్టు తెలిసింది. మరి ఈ సినిమాలో రామ్చరణ్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనది మాజీ నక్సలైట్ పాత్ర అని తెలిసింది.
ఇక మరి అనసూయ లక్ మాములు లక్ కాదే . చిరు చిందేస్తే ఇక అనసూయ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్దేమో. ఇక ఈ భామ యాంకర్గా ఏమి చేస్తది. అసలే ఈమెకు కాస్త పొగరెక్కువ అని అందరూ అంటుంటారు. మరి ఇప్పుడు చిరు సరసన నటించిందంటే ఇంకేముంది. ఈమెను అసలు ఆపగలమా అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే ఇందులో చిరుతో కలిసి చిందేయబోతున్న రంగమ్మ ఆయన స్పీడుని అందుకోగలదా. ఇక చిరు ఎక్కడ అనసూయ ఎక్కడ అంత డాన్స్ స్పీడ్ని అందుకునేంత సీన్ ఉంటదా అంటున్నారు.