సెల‌బ్రెటీలంద‌రూ ప్ర‌స్తుతం సినిమాలు షూటింగ్‌లు లేక ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క‌రోనా కార‌ణంగా ఎవ్వ‌రూ షూటింగ్‌లు సినిమాలు ఏమీ లేక వారి ఇళ్ళ‌లో స్వియ‌నిర్బంధ‌న‌లో ఉన్నారు. ఇక ఏమీ తెచ‌క ఒకొక్క‌రూ వారి వారి అనుభ‌వాల‌ని వారి పాత విష‌యాల‌ను గుర్తు చేసుకుంటూ త‌మ ఫ్యాన్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు టచ్‌లో ఉంటూ సోష‌ల్ మీడియా ద్వారా అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం త్రిష కూడా అదే ప‌నిలో ఉంది. అయితే  ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ భామ ప్ర‌స్తుతం కాస్త స్లో అయింద‌నే చెప్పాలి. సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది.

 

అయితే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ప‌క్క‌న `ఆచార్య‌`లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది ఈ భామ‌కి. చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత త‌న ఫ్యాన్స్ అంద‌రిని మ‌ళ్ళీ ఉర్రూత లూగిస్తుంది అని అంద‌రూ భావిస్తుంటే... `ఎన్నాళ్ళ‌కు గుర్తొచ్చానే వాన` అని వ‌ర్షంలో ఓ ఊపు ఊపిన భామ‌. ఈమెను  చాలా రోజుల త‌ర్వాత తెర మీద చూసిన ప్రేక్ష‌కులు కూడా అలానే అనుకుంటారు అనుకుంటే... ఇంత‌లోనే ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు స‌మాచారం ఇచ్చి అంద‌రినీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఖాళీగా ఉన్న ఈ భామ అభిమానుల‌కు కొంచం ట‌చ్‌లో ఉందామ‌ని త్రిష త‌న ఇద్ద‌రు ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ మాట్లాడింది.

 

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ని  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స్వీయ నిర్భంధంలో ఉన్న త‌న‌కు  ఇద్ద‌రు  ఫ్రెండ్స్ రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్‌ మంచి కంపెనీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ సీక్రెట్‌ను కూడా బ‌య‌ట‌పెట్టేసింది. ఇన్‌స్టాలో 5.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న బ‌న్నీ ఓ ప్రైవేట్ అకౌంట్‌ను న‌డుపుతున్న‌ట్లు చెప్పుకొచ్చింది. అయితే అందులో కేవ‌లం 250 మంది ఫాలో అవుతుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు బ‌న్నీ ఏకంగా 744 పోస్టులు పెట్టిన‌ట్లు తెలిపింది. గ‌తంలో రానా, త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎన్నో వార్తలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  అయితే ఇద్ద‌రి వ‌ర్క్వుట్ అవ్వ‌లేద‌ని విడిపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: