ప్రపంచంలో ప్రళయం సృష్టిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మనుషులకు మద్య దూరాన్ని కూడా పెంచేస్తుంది.  గుంపులుగాగా ఉంటే వైరస్ వెంటనే వ్యాపిస్తుందన్న కారణంగా సామాజిక దూరం పాటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ కరోనా ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికే వస్తుంది..ఈ నేపథ్యంలో పలు షూటింగ్ లు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.  ఓ వైపు సినీ పరిశ్రమకు ఎంతో నష్టం వస్తున్నా కరోనా భయానికి ఎవరూ షూటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు.

 

ఇక రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా వాయిదా వేశారు.  తాజాగా ఇప్పుడు వివాహమహోత్సవాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే.  టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి ప్రభావంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తెలియజేశారు. ఇటీవలే నితిన్ నిశ్చితార్థం షాలిని అనే అమ్మాయితో జరిగింది. నితిన్, షాలిని కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. దుబాయ్ లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.  మార్చి 30న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులెవరు వేడుకలు నిర్వహించవద్దని సూచిస్తూ ఆయన ఓ లెటర్‌ను విడుదల చేశారు. నా అభిమానుల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం.

 

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డివున్నాయో మీకు తెలుసు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. అందువ‌ల్ల ఎక్క‌డా కూడా నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుప‌వ‌ద్ద‌ని మిమ్మ‌ల్ని ప్రార్థిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండడమే దేశానికి సేవ చేసినంత అని నితిన్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: