టాలీవుడ్ హీరో నితిన్, కోలీవుడ్ హీరోయిన్, జూనియర్ మహానటి కీర్తి సురేష్ కలిసి 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల నితిన్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా సూపర్ డ డూపర్ హిట్ అందుకుంది. దీంతో నితిన్ మంచి జోరు మీద ఉన్నాడు. అదే ఊపు మీద కీర్తి సురేష్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాను యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే.. సితార ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

 

సినిమాబ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నితిన్ బర్త్ డే మార్చి 30 అంటే రేపు సోమవారం కావున ఈ చిత్ర యూనిట్ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ లను విడుదల చేసింది.

 

 

చిత్ర యూనిట్ పోస్ట్ చేసిన ఫస్ట్ లుక్ లో నితిన్, కీర్తి సురేష్‌ లు ఒకరి గాలి మరొకరు పీల్చుకునేంత దగ్గర హగ్ చేసుకుని ఒకరిని ఒకరు చూస్తూ రొమాంటిక్ గా, హాట్ గా కనిపిస్తున్నారు. అయితే.. నితిన్, కీర్తి సురేష్‌ లు ఈ సినిమాలో అను, అర్జున్‌ లుగా కనిపించబోతున్నారు. 

 

 

ఈ ఇద్దరు ఓకే సినిమాలో నటించడం ఇది మొదటి సారి. కానీ.. ఈ పోస్టర్ చూస్తుంటే వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. భీష్మ చిత్రం సూపర్ హిట్ అవ్వటంతో మళ్లీ  ఈ కాంబినేషన్ ను రిపీట్ చేశారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ సినిమాను ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: