టాలీవుడ్ రాక్స్టార్ ఎవరంటే ప్రత్యేకంగా దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పక్కర్లేదు. తనదైన సంగీతంతో హుషారెత్తించే సంగీతం దేవీ సొంతం అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ని సొంతం చేసుకున్న దేవి గత కొంత కాలంగా తెలుగులో తన పట్టుని కోల్పోతున్నాడు. నెమ్మది నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకటి అంత మధురం ఆయన సంగీతంలో కనిపించడం లేదు. ఒకప్పుడు దేవిశ్రీ మ్యూజిక్ అంటే చాలు పాటల కోసమైన సినిమా చూడొచ్చు అన్నట్లు పాటలు హిట్ అయితే చాలు సినిమాకి వెళ్ళిపోయే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అందుకే లేరనే మాటలేదు.
అయితే ఈమధ్య కాలంలో కాస్త ఇంట్రస్ట్ తగ్గించాడో లేక పట్టుచేజారిపోతుందో అర్దం కావడం లేదుకాని గతంలాగా తన మ్యూజిక్ ఉండడం లేదు. దాంతో ఇక తమన్ ఆ స్థానాన్ని దక్కించుకుంటున్నాడు. ఇదిలా వుంటే దేవీ పాటలకు బాలీవుడ్లో మంచి ఫాలోవర్స్ వున్నారు. కానీ టాలీవుడ్లో మాత్రం నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. `ఆ అంటే అమలా పురం..` నుంచి `ఆర్య 2` కోసం చేసిన `రింగ రింగా…` పాటలు బాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్స్ గా అయ్యాయి. తాజాగా దేవీకి ఈ పాటలే బాలీవుడ్ ఆఫర్ని కూడా తెచ్చిపెట్టాయట. సల్మాన్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `రాధే`. ఆ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ దేవిశ్రీప్రసాద్ని వెతుక్కుంటూ వచ్చింది. అయితే ఈ ప్రపోజల్ని ప్రభుదేవా తీసుకొచ్చాడట. చెప్పిన వెంటనే సల్మాన్ఖాన్ ఓకే చెప్పేశాడట. దీంతో 2011లో సల్మాన్ హీరోగా రీమేక్ అయిన `రెడీ` చిత్రం కోసం `ధింక చిక…` అనే పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఈ రాక్ స్టార్. మళ్ళీ ఇన్నేళ్లకి పూర్తి స్థాయిలో అన్ని పాటలకు సంగీతం అందించే అవకాశం `రాధే` చిత్రంతో బాలీవుడ్లో దక్కింది. మరి ఈ అవకాశం చాలా గొప్పదనే చెప్పాలి. దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే బావుంటుంది.