టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో శ్రీను వైట్ల ఒకరు. దాదాపుగా తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ దర్శకుడు కమర్షియల్ సినిమాల్లో కామెడీ పండించడంలో దిట్ట. అయితే కొన్నాళ్లుగా సక్సెస్ కు దూరంగా ఉంటూ కెరియర్ లో వెనుకపడ్డ శ్రీను వైట్ల మళ్ళీ ఫామ్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో సినిమాలు తీసిన శ్రీను వైట్ల వరుణ్ తేజ్ తో మిస్టర్, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేసి అడ్రెస్ లేకుండా పోయాడు. 

 

ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలు భయపడుతున్నారు. అయితే తన దర్శకత్వంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా సీక్వల్ తో మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు శ్రీను వైట్ల. మంచు విష్ణుతో శ్రీను వైట్ల చేసిన ఢీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. విష్ణుకి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా అదే. శ్రీను వైట్ల మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమా. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. డైరక్టర్ గా కొద్దిగా వెనుకపడ్డ శ్రీను వైట్ల నిర్మాతగా మారాలని అనుకున్నాడు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఒక నిర్మాణ సంస్థని ఏర్పాటుచేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దాని గురించి  ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. 

 

మంచు విష్ణు కూడా కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. ప్రస్తుతం మోసగాళ్లు సినిమా చేస్తున్న విష్ణు త్వరలోనే శ్రీను వైట్ల ఢీ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల సినిమా షూటింగులు ఆపేశారు. మళ్ళీ షూటింగులు మొదలు పెట్టినప్పుడు మంచి ముహూర్తం చూసుకుని ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: