యువ హీరో నితిన్ రీసెంట్ గా భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుములు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. భీష్మ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. అతను వెంకీ కుడుములు అయితే ఇతను వెంకీ అట్లూరి.. ఇద్దరి వెంకీలతో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. తొలిప్రేమతో తోలి సినిమా హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఆ తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ ను సినిమాతో మాత్రం  నిరాశపరచాడు. 

 

అందుకే నితిన్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు వెంకీ అట్లూరి. రంగ్ దే సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహానటి తర్వాత తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ కు సరైన ఛాన్సులు రాలేదని చెప్పాలి. అజ్ఞాతవాసి తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన కీర్తి సురేష్ రంగ్ దే సినిమాతో మళ్ళీ ఇక్కడ సత్తా చాటాలని చూస్తుంది. ఓ పక్క మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ ఇకమీదట తెలుగు సినిమాల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుందట. ఇదే కాదు లేటెస్ట్ గా మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది అంటున్నారు. 

 

ఇదిలాఉంటే భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ రంగ్ దే కూడా హిట్టు కొడితే ఇక ఫామ్ లోకి వచ్చినట్టే అవుతుంది. రంగ్ దే తర్వాత కూడా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో నితిన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరి రాబోయే సినిమాలతో నితిన్ నిజంగానే వరుస హిట్ల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: