కరోనా వైరస్ వల్ల దేశమంతా లాక్ డౌన్ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకూ ఒకే మాట చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇళ్లలో నుండి కదలకుండా ఉండడని. అందువల్ల ప్రతీ ఒక్కరూ ఇళ్లలోనే ఉండి సామాజిక దూరం పాటిస్తున్నారు. కరోనా వైరస్  ప్రభావం తగ్గే వరకు ఎవరూ ఎవరిని కలవకూడదనే నిర్ణయం కారణంగా అందరూ సోషల్ మీడియాలో దగ్గరవుతున్నారు. 

 

ఇళ్లలోనే ఉండి ఫోన్లో తమ సందేశాలని తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు. అంతకుముందు వీటన్నింటికీ దూరంగా ఉండేవారు సైతం ఈ పరిస్థితుల్లో వేగంగా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున ట్విట్టర్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. 

 

రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలని షేర్ చేసి అభిమానులకి ఆనందాన్ని పంచాడు. అలాగే కొన్నాళ్ళ కిందట ట్విట్టర్ నుండి బయటకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ తో పాటు భీమ్ ఇచ్చిన గిఫ్ట్ ని ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ అందుకున్నాడు. సామాజిక దూరం కారణంగా డిజిటల్ గిఫ్ట్ తో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఐసోలేషన్ టైమ్ లో రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మాసంద్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

 

ఈ తరం హీరోల్లో దాదాపు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు.  శర్వానంద్ మాత్రం వీటికి దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల్నికలుసుకోలేం కాబట్టి అతడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాడు.. ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేసి కరోనా క్రైసిస్ ఛారిటీకి ౧౫ లక్షల విరాళాన్ని ప్రకటించాడు. మొత్తానికి సామాజికంగా దూరమయిన అందరూ సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గర అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: