2017లో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా మున్నా మైఖేల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ నిధి అగర్వాల్. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకొని ఈ బామ సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావటంతో నిధి ఆశించిన స్థాయి బ్రేక్ రాలేదు. అయితే అక్కినేని హీరోలే అందాల నిధికి మరో అవకాశం కూడా ఇచ్చారు. అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో నిధి అగర్వాల్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ కావటంతో నిధి కెరీర్ కు ఎలాంటి బ్రేక్ రాలేదు.
అయితే ఈ అందాల భామకు కావాల్సిన సక్సెస్ ను అంధించాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ పోతినేనికి జోడిగా నటించిన నిధి అగర్వాల్. ఈ సినిమా సక్సెస్ తో నిధికి అవకాశాలు కూడా పెరగాయి. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ ఎంట్రీ ఇస్తోంది ఆ బ్యూటీ . జయం రవి హీరోగా తెరకెక్కిన భూమి సినిమాలో నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్ ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో కూడా నటిస్తోంది. కన్నడ ఇండస్ట్రీలోకి కూడా జేమ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇలా అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తున్న ఈ భామ ఓ తెలుగు సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం అల్లుడు అదుర్స్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ కోసం నిథి అగర్వాల్ ను సంప్రదించారు. అయితే ఈ సినిమాలో ఒక్క పాటలో నటించేందుక ఏకంగా 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది నిధి. దీంతో షాక్ తిన్న చిత్రయూనిట్ నిథిని తీసుకోవాలా వద్ద అని ఆలోచిస్తున్నారు.