కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వినోద రంగం పూర్తిగా మూత పడింది. అయితే కష్ట కాలంలో తారలు అన్ని రకాలుగా బాదితులుకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా సంక్రమించే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎవరి తోచిన సాయం వారు అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు కోట్ల విరాళాలు ప్రకటించి తమ పెద్ద మనసు చాటుకున్నారు.
అయితే హీరోయిన్ శిఖా మల్హోత్రా మాత్రం విభిన్నంగా స్పందించింది. నర్సింగ్ డిగ్రీ చేసిన ఆమె స్వయంగా నర్స్ గా ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తోంది. షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందిన `ఫ్యాన్` సినిమాలో పేరు తెచ్చుకున్న నటి శిఖా మల్హోత్రా. ఈ యువ నటీమణి ఓ హాస్పిటల్ లో కరోనా వైరస్ భారిన పడిన రోగులకు నర్స్గా సేవలందిస్తోంది. శిఖా ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, సఫ్ దార్ జంగ్ హాస్పిటల్లలో నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది.
ప్రస్తుతం నర్స్గా సేవలందిస్తున్న శిఖా `మన దేశానికి నేను సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాకు మీ ఆశీస్సులు కావాలి. దయచేసి అందరూ ఇంటి దగ్గరే ఉండండి. అధికారులకు సహకరించండి` అంటూ తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది శిఖా. ముంబైలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
View this post on InstagramHindu Hriday Samrat bala Saheb thakrey #hospital #isolationward from tomorrow onwards 27/03/20 On the behalf of my Bsc(hons) #nursing degree So Please Feel free to connect with me anytime at the time of any emergency occurs near you. Please Follow the home quarantine keep you and your loved once safe and follow all the preventive measures according to the #who 🙏🏻 Please don’t take any chance Lot of people working day and night to keep the nation safe💐 #fightbacktogether #homequarentined @narendramodi @amitabhbachchan @anupampkher @zeenews @aajtak @abpnewstv @ddnews_official