టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాల హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇటీవల తెలుగులో కాస్త స్లో అయినా తమిళ, హిందీ సినిమాలతో దూసుకుపోతోంది రకుల్. కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన రకుల్, తరువాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వెంటనే కోలీవుడ్ లోనూ అడుగుపెట్టేసింది అయితే ఈ భామకు తొలి సక్సెస్ రావటానికి మాత్రం చాలా సమయమే పట్టింది. 2009లో వెండితెరకు పరిచయం అయిన రకుల్ బ్రేక్ కోసం 2013 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో రకుల్ ఖాతాలో తొలి సక్సెస్ పడింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా మోస్ట్ లక్కీ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. గత కొన్నాళ్లుగా తెలుగులో ఛాన్స్ లు లేకపోవడంతో తమిళంలో బిజీ అయ్యేందుకు ప్రయత్నించింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు ఛాన్స్ లు వచ్చినా కూడా నిరాశే మిగిలింది. దాంతో బాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి ఆఫర్ దక్కింది.
నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఈ అమ్మడి ఎంపిక చేశారట. ప్రస్తుతం నితిన్ చేస్తున్న చిత్రాలు పూర్తి అయిన వెంటనే కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో ఈ కొత్త సినిమా ప్రారంభంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో ఛాన్స్ రావడంతో ఆమె మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్స్ కాకున్నా టైర్ బి హీరోలతో అయినా రకుల్ బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. భీష్మ చిత్రంతో సక్సెస్ దక్కించుకున్న నితిన్ రంగ్ దే చిత్రంతో త్వరలో రాబోతున్నాడు. ఆ సినిమా కూడా సక్సెస్ అయితే నితిన్ తో నటించడం వల్ల రకుల్ కు క్రేజ్ దక్కుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి నితిన్ తో ఛాన్స్ రకుల్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో మరోసారి తన విజయాల పరంపర కొనసాగిస్తుందేమో చూడాలి.