ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో దానిని మెల్లగా అరికట్టేందుకు పలు దేశాలు లాకౌట్ చేస్తూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి యుద్ధం ప్రకటించాయి. మన ఆంధ్ర, తెలంగాణ తో పాటు అటు తమిళనాడు లో కూడా ఆ మహమ్మారి కోరలు విప్పుతుండడంతో అక్కడి ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టింది. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడైన సముద్రఖనికి కరోనా సోకింది 'ప్రే ఫర్ సముద్రఖని' అంటూ కొందరు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాద్యమాల్లో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఎయిర్పోర్ట్ నుండి మాస్క్ కట్టుకుని బయటకు వస్తున్న ఫోటోని పెట్టి మరీ సముద్రఖని పై ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రోల్స్ ట్విట్టర్ లో విపరీతంగా జరుగుతున్నాయి. 

 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఆక్వా మాన్, స్పైడర్ మ్యాన్ వంటి బొమ్మలను సముద్ర ఖని మొహానికి పెట్టి పలువురు మెమె లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆయనపై ఈ విధంగా సడన్ గా ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్ధం కావడంలేదని, సముద్రఖని మంచి పేరున్న దర్శకుడు, నటుడని, వివాదరహితుడిగా పేరు సంపాదించారని, అటువంటి వ్యక్తి పై ఎందుకు ఇలా నెగటివ్ ప్రచారం చేస్తూ ట్రోల్స్ చేస్తారు అంటూ మరికొందరు నెటిజన్లు ట్విట్టర్ లో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ్ లో పలు విజయవంతమైన సినిమాలు తీసిన సముద్రఖని నటుడిగా కూడా మంచి పేరు సంపాదించారు. 

 

 

ఇక ఇటీవల తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన హిట్ మూవీ అలవైకుంఠపురములో విలన్ పాత్రలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించిన సముద్రఖని, ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న రౌద్రం రణం రుధిరం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఆయన పై హఠాత్తుగా ప్రారంభమయిన ఈ ట్రోల్స్ ఎప్పటికి ఆగుతాయో ఏమో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: