భీష్మ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఆ తర్వాత డైరెక్ట్ చేసిన మిస్టర్ మజ్నుతో ఫ్లాప్ చవిచూశాడు అందుకే నితిన్ తో రంగ్ దేతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు డైరక్టర్ వెంకీ. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నితిన్, కీర్తి సురేష్ ల జంట ఏది మ్యాజిక్ చేసేలా ఉంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది.  

 

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం వరకు సూపర్ ఫామ్ కొనసాగించిన రకుల్ నాగార్జున మన్మధుడు 2 తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ అందుకోవడం లేదు. ఇక్కడ ఎలాగూ ఛాన్సులు రావట్లేదని అమ్మడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. తెలుగులో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్ కు నితిన్ లక్కీ ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ తో కెరియర్ ఫుల్ జోష్ కనబరుస్తున్న రకుల్ ఈసారి తెలుగులో కూడా రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. 

 

టాలీవుడ్ లో స్కిన్ షో విషయంలో ఇన్నాళ్లు కొద్దిగా ఆలోచించిన ఈ అమ్మడు ఇప్పుడు తగ్గేది లేదని అంటుంది. నితిన్ తో రకుల్ రొమాన్స్ సినిమాకు హైలెట్ గ నిలుస్తుందని తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా గురినిచి మరిన్ని అప్డేట్స్ త్వరలో బయటకు వస్తాయి. భీష్మాతో హిట్ అందుకున్న నితిన్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ఈసారి ఆ హిట్ ట్రాక్ కొనసాగించాలని చూస్తున్నాడు. మనోడి ప్లానింగ్ చూస్తుంటే ఈసారి నితిన్ పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: