ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టార్ మూవీ ని దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ లుక్ వీడియో ని యూట్యూబ్ లో ఇటీవల రిలీజ్ చేసింది యూనిట్. ప్రస్తుతం వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. 

 

మరొక హీరో ఎన్టీఆర్ కోరమం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మొదట రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ని ఎంపిక చేసిన సమయంలోనే ఆమె తాలూకు సీన్స్ ని తీయాలని భావించిందట సినిమా యూనిట్. అయితే ఇప్పటివరకు మధ్యలో కొన్ని కారణాల వలన అది వాయిదా పడుతూ వచ్చింది. కాగా మధ్యలో ఆమె సినిమా నుండి తప్పుకుందని, అలానే ఆమె కేటాయించిన డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో రాజమౌళి కూడా ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకోవాలని భావించినట్లు పలు వార్తలు ప్రచారం అయ్యాయి. 

 

అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ, ఇటీవల మూడు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ, వాస్తవానికి ఆలియా తాలూకు సీన్స్ ఎప్పుడో తీయాలని, అయితే అది కుదరలేదని, ఇక రాబోయే మరికొద్దిరోజుల్లో ఆమె తన సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతోందని రాజమౌళి స్పష్టం చేసారు. దీనితో అసలు ఆమె ఈ సినిమాలో ఉందో లేదో అనే వార్తలకు పూర్తిగా చెక్ పడ్డట్లైంది. అలానే సినిమాని కూడా అనుకున్న విధంగానే 2021 జనవరి 8 న రిలీజ్ చేస్తాం అని అన్నారు రాజమౌళి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: