ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన అన్ని దేశాలు కూడా ఎంతో భయంతో వణికిపోతున్నాయి. ఎంతో వేగవంతంగా దేశ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ని అంతం చేసేందుకు, ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండడమే సరైన మార్గం అని భావించిన పలు దేశాలు ఇప్పటికే లాకౌట్ లు ప్రకటించాయి. మన దేశంలో కూడా ఏకంగా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే ఈ లాకౌట్ వలన మధ్యతరగతి, దిగువతరగతి వర్గాల వారు మాత్రం చాలా వరకు నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

 

మరికొందరు రోజువారీ వేతనాలకు పని చేసేవారికైతే కనీసం పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ పరిస్థితి ని గమనించిన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ ఇవ్వడంతో తో పాటు కొంత మేర నగదును కూడా ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. అయితే ఇటువంటి కష్ట సమయంలో ప్రజలను మేము కూడా ఆదుకుంటాం అంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఎందరో ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. ఇక ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమకు వీలైనంత ఆర్ధిక సాయాన్ని అందించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. 

 

ఇకపోతే నేడు కాసేపటి క్రితం యువ నటుడు నారా రోహిత్ రూ.30 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అయితే అందులో రూ.10 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు అలానే, మరొక రూ.10 ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు రోహిత్ అందచేయడం జరిగింది. కాగా ఈ విధంగా తనవంతుగా ఆర్ధిక సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన నారా రోహిత్ పై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నారా రోహిత్, టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయడు కుమారుడు అనే విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: