నందమూరి నట సింహం బాలకృష్ణ కేవలం సినిమా హీరో కాదు... నందమూరి అనే పెద్ద కుటుంబానికి ప్రతినిధి. అంతే కాదు, ఓ నియోజకవర్గానికి ప్రతినిధి. శాసనసభ్యుడు. సినీ హీరోగా, రాయకీయ నాయకుడిగా జనాలలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన సినిమా రిలీజవుతుందంటే నందమూరి ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే రాజకీయ నాయకుడిగా జనాలలోకి వస్తే కూడా ప్రజలు ఆయన మీద చూపించే అభిమానం ఎంతగా ఉంటుందో ప్రతీసారి తెలుస్తూనే ఉంటుంది. అలాంటి ప్రజల కోసం బాలయ్య మాత్రం స్పందించడం లేదని చలించడం లేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఈ తరహా కామెంట్స్ ఎదుర్కొంటున్న వాళ్ళలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తర్వాత టాలీవుడ్ లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఉండటం ఆసక్తికరం. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా. గత పది రోజులుగా సామాన్య ప్రజల దగ్గర్నుంచి సినిమా సెలబ్రిటీస్ వరకు అందరూ ఈ కరోనా కారణంగా స్వీయ నిర్భంధం లో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తిగా ఇంటికే పరిమితమైన అందరూ కరోనా నుంచి క్షేమంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలో కష్ఠాల్లో ఉన్న పరజలకి సినీ కార్మీకులకి మెగాస్టార్ చిరంజీవి నుంచి నితిన్ లాంటి యంగ్ హీరోలు బుల్లి తెర యాంకర్ ప్రదీప్ వంటి వాళ్ళు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. తమకి సాధ్యమైనంత విరాళాన్ని ప్రకటించి సమాజం పట్ల తమ బాధ్యను చాటుకున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇంతవరకు ఏ విరాళాన్ని ప్రకటించకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి బాలయ్య ప్రకటించినా కూడా పబ్లిసిటీ కోరుకోకుండా సైలెంట్ గా ఉన్నాడా .. లేదా ప్రజల గురించి మరేదైనా ఆలోచించారా అన్నది ఇంకా తెలియలేదు. ఏదేమైనా ఈ విషయం లో బాలయ్య ఆలోచన ఏంటన్నది త్వరలో బయటపడనుందని ఆయన అభిమానులు అంటున్నారు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: