కరోనా మహమ్మారి రావడంతో ప్రపంచమంతా లాక్డవున్ను పాటిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. దాంతో అందరూ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కనీసం మనిషి బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడిపోతున్నాడు. దానికి కారణం ఈ కరోనా ఒక అంటు వ్యాధి కావడంతో ఎక్కడ ఒకరి నుంచి మరొకరికి సోకుంతుందో అన్న భయంతో వీరు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు. చేతి పనులు చేసుకునే కూలిల నుంచి హైటెక్ వరకు ఎవ్వరికి పని లేదనే చెప్పాలి. దీంతో ఒక్కసారిగా ప్రపంచ మంతా ఆర్ధిక మాంధ్యంలో మునిగిపోయింది.
ఇక ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే మేమున్నామంటు మేము కేవలం రీల్ హీరోస్ మాత్రమే కాదు రియల్ హీరోలమనిపించుకుంటున్నారు. మన టాలీవుడ్ టాప్ స్టార్స్. తమ సినిమాలకు టికెట్లు కొని కోట్లల్లో వసూళ్లను తీసుకొచ్చే ప్రేక్షకులు బాధల్లో ఉంటే అదే స్టార్స్ వాళ్ళ కోసం దిగి వస్తారు.. ఆపద ఎలాంటిదైనా సరే మీకు మేమున్నాం అంటూ స్టార్స్ ప్రజలకు హామీ ఇవ్వడం.. విరాళాలు ప్రకటించడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. చిరంజీవి, పవన్కళ్యాణ్, నాగార్జున, ప్రభాస్, మహేష్బాబు, రామ్చరణ్తేజ్, ఎన్టీఆర్, నితిన్, నిఖిల్, సందీప్కిషన్, అల్లరినరేష్ ఇలా ఎవరికి తోచినంత వారు ఇచ్చి సమాజం పట్ల తమకున్న బాధ్యతను నిర్వర్తించారు. ప్రజలకు అండగా నిలిచారు. కోట్లల్లో రెమ్యూనరేషన్లు తీసుకోవడమే కాదు. ఆపద వస్తే అండగా నిలబడడం కూడా మాకు తెలుసు అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. కొంత మంది చిన్న హీరోలు వారికి పెద్దగా సినిమాలు లేనప్పటికీ మేము కూడా మీతోనే అంటూ ప్రతి హీరో స్పందించడం అన్నది హర్షించదగ్గ విషయం.
అంతే కాక కొంత మంది హీరోలు కేవలం సీఎం.రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వడమే కాక సినీ కార్మికుల కోసం కూడా వాళ్ళకు వీలైనంత సహాయం చేశారు. ప్రభాస్ సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వడమేకాక ఆయన మరో 50లక్షలు కరోనా విపత్తు నిధికి ఆయన ఇచ్చారు. అంతేకాక బన్నీ కూడా సీఎం రిలీజ్ ఫండ్కి ఇవ్వడమే కాక ఈ రోజు మరో 20 లక్షలు కరోనా విపత్తు నిధికి అందించారు. వీరందరూ ఇంత పెద్ద మనుసు చేసుకుని సమాజం పట్ల వీరికున్న బాధ్యతను ప్రజల పైన ఉన్న అభిమానానికి సోషల్ మీడియా అంతా సర్వత్రా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.