మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించిన అ ..ఆ సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలైంది. ఆ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ని దక్కించుకుంది. అంతే ఇక నితిన్ మళ్ళీ సక్సస్ ని చూడలేదు. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, లై సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో దాదాపు సంవత్సరం పాటు ఏ సినిమాని చేయలేదు. ఈ లోపు మంచి కథలని సెలెక్ట్ చేసుకున్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టాడు. వాటిలో ముందు ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నాడు.

 

ఇక ఈ ఏడాది వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ తో మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇదే ఊపుతో ప్రస్తుతం తెరకెక్కుతున్న రంగ్ దే సినిమా మీద 
భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రంగ్ దే నుండి రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తే ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. ఇక నితిన్ అండ్ కీర్తి సురేష్ లది కూడా ఫ్రెష్ కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచుతోంది. 

 

నితిన్ బర్త్ డే సందర్బంగా రంగ్ దే సినిమాపై తనకు చాలా నమ్మకం ఉందని అంటున్నాడు. ఖచ్చితంగా రంగ్ దే మరో ఇష్క్ అని ఆ సినిమాలా మంచి సక్సస్ ని అందుకుంటుందని అంటున్నాడట. ఆ నమ్మకానికి కారణం పీసీ శ్రీరామ్ అని చెబుతున్నాడట. ఇష్క్ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అందుకే నితిన్ ఇలా నమ్మకం పెట్టుకున్నాడు అంటూ లాజిక్ లేకుండా అంటున్నాడట. నిజంగా పీసీ శ్రీరామ్ ది గనక లక్కీ హ్యాండ్ అయితే నిజంగా నితిన్ కి బ్లాక్ బస్టర్ పడాలి. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: