కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గడ గడా వణికిస్తున్న ప్రస్తుత సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాం. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక మాంద్యం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే వేతనంలో కొంత కోత విధిస్తున్నారు. కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో అవసరమయ్యే ప్రతీ ఒక్క పైసాని చాలా పకడ్బందీగా వాడుకుంటున్నారు.

 

అయితే ఇప్పటికే కరోనా క్రైసిస్ నేపథ్యంలో చాలా మంది విరాళాలు ప్రకటించారు. టాటా గ్రూప్ 1500 కోట్లు ఇవ్వగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రకటించాడు. మన టాలీవుడ్ సెలెబ్రిటీలలో ప్రభాస్ నాలుగు కోట్లు, పవన్ కళ్యాణ్ రెండూ కొట్లు, మహేష్ బాబు కోటి చిరంజీవి కోటి ఇలా ఒక్కొక్కరు తమవంతు సాయం చేస్తున్నారు. అలాగే కొందరు మాస్కులు, మరికొందరు వైద్యులకి అవసరమయ్యే సామాగ్రిని ఉచితంగా తయారు చేసిస్తామని చెప్పారు.

 

 

అయితే బాలీవుడ్ నటి మాత్రం ఈ కష్టకాల సమయంలో సేవ చేస్తానని ముందుకొచ్చింది. దేశంలో కరోనా పేషంట్లకి సేవలు అందించడానికి నర్సుల అవసరం చాలా ఉంది. ఇది గుర్తించిన ఆ నటి తానే నర్సుగా మారింది.షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’లో ఓ పాత్ర చేసిన ఆ నటి పేరు.. షికా మల్హోత్రా. ముంబయిలోని ఓ హాస్పిటల్లో ఆమె నర్సుగా మారి కరోనా పాజిటివ్ కేసుల బాధితులకు సేవలు అందిస్తోంది.

 

మహారాష్ట్రలో కరోనా బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. గతంలో ఆమె నర్సింగ్ డిగ్రీ చేసిందట. అందువల్ల ఇలాంటి సమయంలో తన నర్సింగ్ సేవలని అందించడానికి ముందుకు వచ్చింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికడుతుంటే కరోనా బాధితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ సాయం చేయడానికి ముందుకు రావడం చాల గొప్ప నిర్ణయం.

మరింత సమాచారం తెలుసుకోండి: