సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు దానికి మించిన డాన్సర్ ఆమెతో డాన్స్ చేయాలి అంటే హీరోలు కూడ భయపడిపోతారు. ఒక సీన్ లో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నప్పుడు ఆమె ఎక్కడ డామినేట్ చేస్తుందో అన్నభయం తనకు నిరంతరం కలిగేదని శర్వానంద్ ఓపెన్ గా చెప్పాడు అంటే సాయి పల్లవి స్థాయి అర్థం అవుతుంది. ‘ఫిదా’ సూపర్ సక్సస్ తరువాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా సక్సస్ అవ్వకపోయినా ఆమె క్రేజ్ యూత్ లో ఏమాత్రం తగ్గలేదు. 


ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఈమధ్య ఒకప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి ఎవరికీ తెలియని ఒక ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది. సాయి పల్లవి తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగకు సంబంధించిన కుటుంబంలో పుట్టిందట. అయితే ఆమె తల్లి తండ్రులు చదువుకున్న వాళ్ళు కావడంతో తాను ఎక్కువగా చెన్నైలో పెరిగిన విషయాన్ని వివరించింది. 


అయితే ఆమెకు సంబంధించిన బాడుగ గిరిజన తెగకు సంబంధించిన బడుగ భాషకు లిపి లేదు అన్న విషయాన్ని బయట పెట్టింది. తాను చిన్నతనంలో గిరిజిన తండాలకు వెళ్ళిన సందర్భాలు తనకు ఇంకా గుర్తు ఉన్నాయి అంటూ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. అలాంటి గిరిజన తెగలో పుట్టిన తనకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం అనీ ఆ ఇష్టంతోనే తాను సినిమా హీరోయిన్ అయిన విషయాన్ని వివరిస్తూ తాను సినిమా హీరోయిన్ ను అవ్వకపోతే డాక్టర్ చదువు చదివి కార్డియాలజిస్ట్ అవ్వాలి అన్న లక్ష్యం తనకు ఉండేది అన్న విషయాన్ని వివరించింది.


ఇదే సందర్భంలో ఆమె తన నటన గురించి మాట్లాడుతూ ఒక సీన్ ను ఒక టెక్ లో కాకుండా ఎక్కువ టెక్ లు తీసుకోవడం తనకు ఇష్టం ఉండదు అని చెపుతూ తాను సూర్యతో కలిసి నటించిన ‘ఎన్ జి కె’ మూవీ షూటింగ్ సమయంలో ఎకువ సార్లు ఒక సీన్ లో టెక్ తీసుకోవలసి వచ్చినప్పుడు తనకు విపరీతమైన బాధ కలిగి ఆరాత్రి తన తల్లిని కౌగలించుకుని ఇక సినిమాలు తాను వదిలేస్తాను అంటూ ఏడ్చిన విషయాన్ని బయట పెట్టింది. దీనినిబట్టి చూస్తుంటే సాయి పల్లవి తన నటన విషయంలో ఎంత పర్ఫెక్ట్ అన్నది అర్ధం అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: