టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోల హవా బాగా పెరిగిపోతుంది.  ఇటీవల నాని నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ మూవీలో హీరోగా నటించిన విశ్వక్ సేను మంచి విజయం సాధించాడు.  అంతకు ముందు ఫ‌ల‌క్‌నుమాదాస్‌  తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంతగడి చేశాడు. అయితే ఎంత సక్సెస్ ఉన్నా కొంత మంది హీరోలకు అదృష్టం కలిసి రావు.  కొంతమంది హీరోలు మాత్రం రాత్రికి రాత్రే  స్టార్ హీరోలుగా మారిపోతుంటారు.    అందుకే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎదుటివారిని అంచ‌నా వేయాలి. హీరోగా సక్సెస్ సాధించిన తర్వాత కొంత మంది గతంలో అతన్ని అవమానించిన వారు బాధపడుతుంటారు.  

 

తాజాగా తాను కూడా ఓ ప్రొడ్యూసర్ చేతిలో అవమానం పొందానని ఓ కార్యక్రమంలో చెప్పాడు విశ్వక్ సేన్.   `వెళ్లిపోమాకే` సినిమా త‌రువాత విశ్వ‌క్‌సేన్ ఈ ప‌రిస్థితిని ఓ నిర్మాత నుంచి ఎదుర్కొన్న‌ట్టు తెలిసింది.  త‌న సినీ ఎంట్రీకి సంబంధించిన విష‌యాల్ని వెల్ల‌డిస్తూ ఎన్నో విషయాలు మాట్లాడారు.  త‌న‌కు అవ‌కాశం ఇస్తాన‌ని, తానే హీరోన‌ని మాటిచ్చిర క‌థ చెప్పించాడ‌ట‌. అందులో న‌లుగురు హీరోల్లో మెయిన్ హీరో విశ్వ‌క్‌సేన్ అన్నార‌ట‌.

 

ఆ త‌రువాత త‌న‌ని నెల రోజుల త‌రువాత అదే పాత్ర‌ని మ‌రో వ్య‌క్తికిచ్చార‌ట‌, ఇలా.. చివ‌రికి విశ్వ‌క్‌సేన్ పాత్ర నాలుగ‌వ పాత్ర‌కు మారిపోయింద‌ట‌.  అయితే తన కెరీర్ కొనసాగించడానికి దేనికైనా సిద్ద పడటంతో తాను బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారట. అయితే తనకు జరిగిన అవమానం తనలో కసిని పెంచిందని..  తానే ఎందుకు సినిమా తీయ‌కూడ‌ద‌ని `అంగ‌న‌మ‌లై డైరీస్‌`ని తెలుగులో రూపొందించాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే త‌న‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌ర‌నేది మాత‌కం విశ్వ‌క్ బ‌య‌ట పెట్ట‌లేదు. విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం `పాగ‌ల్‌` మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: