'సాహో' చిత్ర పరాజయంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీదున్న ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా పేరు ఖరారు ఈ చిత్రానికి 'జాన్', 'ఓ డియర్', 'రాధే శ్యామ్', అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా, 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు.

 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమయాన్ని చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వాడుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కరోనా ప్రభావం ఇప్పుడే తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నెక్స్ట్ షెడ్యూల్ కి టైం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సెట్ వేసి తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటున్న ఈ సమయంలో, దసరాకి కేజీఎఫ్ 2 విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ఏం చెయ్యబోతున్నారనేది వేచి చూడాలి. కథను అనేక మలుపులు తిప్పి ప్రేక్షకులను కట్టి పడెయ్యాలనుకున్న సాహో సినిమా, తను వేసుకున్న ముళ్లల్లో తానే చిక్కుకుని బోర్లా పడిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాయబోతోందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: