విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌ లో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ఓ బాలీవుడ్ బ్యూటీ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇండియన్‌ స్క్రీన్ బాహుబలి ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పరిచయం అయిన హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.

 

బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు రీజినల్ సినిమా మీద కూడా దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో కాంపిటీషన్ పెరగటంతో అవకాశాలు తగ్గుతాయేమో అన్న అనుమానంతో ముందు నుంచే జాగ్రత్త పడుతుంది ఈ శ్రీలంన్‌ బ్యూటీ. తాజాగా ఈ భామ ఓ క్రేజీ టాలీవుడ్ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది .

 

మ్యూజిక్‌ వీడియోస్‌తో ఇండస్ట్రీ కి పరిచయం అయిన జాక్వెలిన్‌ కమర్షియల్‌, యాక్షన్‌, రొమాంటిక్‌ సినిమాల్లోనూ నటించింది. చివరగా బాలీవుడ్‌ లో రేస్‌ 3 లో నటించింది జాక్‌. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న పలు బాలీవుడ్‌ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆ సినిమాల్లో నటిస్తూనే రీజినల్ సినిమా మీద కూడా దృష్టి పెడుతోంది.


పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం పింక్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్‌ లో ఓ పీరియాడిక్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు హీరోయిన్‌ గా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందించే ఆలోచనలో ఉన్న క్రిష్ అందుకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: