బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌ కు కరోనా పాజిటివ్ అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విదేశాల నుంచి వచ్చిన తరువాత పలు పార్టీలో పాల్గొనటం ఆ పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పాల్గొనటం సంచలనంగా మారింది. ఆమెతో పార్టీల్లో పాల్గొన్న వారు పార్లమెంట్‌కు, ఏకంగా రాష్ట్రపతి భవన్ కు కూడా వెళ్లటం తో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కనికా మీద క్రిమినల్‌ కేసు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తోంది.

 

కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన వ్యక్తులకు ప్రతీ 48 గంటలకు ఒకసారి ఆరోగ్య పరిస్థితిపై టెస్ట్ లు నిర్వహిస్తారు. కనికా ప్రస్తుతం సంజయ్ గాంథీ పోస్ట్ గ్రాడ్యూయేట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ లో చికిత్స పొందుతోంది. ఇప్పటికే ఆమెకు నాలుగు సార్లు టెస్ట్ లు నిర్వహించగా సోమవారం ఐదోసారి టెస్ట్ లు చేశారు. అయితే తాజా టెస్ట్ లో కూడా ఆమెకు పాజిటివ్‌ రావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇన్సిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఆర్కే ధిమాన్‌ క్లారిటీ ఇచ్చారు. కనికా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్టేబుల్‌ గానే ఉందన్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌ ఆంధోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజే పెద్ద సంఖ్యలు పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Going off to bed. Sending you all loving vibes. Stay safe you guys ❤ Thank you for your concern but I am not in the ICU. I am fine. I hope my next test is negative. Waiting to go home to my kids and family 🤗❤ miss them!

A post shared by kanika Kapoor (@kanik4kapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: