టాలీవుడ్ లో ప్రేమికుడు మూవీతో హీరోగా పరిచయం అయిన ప్రభుదేవ అంతకు ముందు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. సుందరం మాస్టర్ తనయుడైన ప్రభుదేవ డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించి పలు హీరోలకు కొరియోగ్రాఫీ చేశారు. ఆ తర్వాత ప్రేమికుడు సినిమాతో హీరోగా మారిన ప్రభుదేవ తర్వాత కొన్ని సినిమాల్లో నటించా తర్వాత ‘నేనొస్తానంటే నువ్వొద్దంటావా’, ‘పౌర్ణమి’ మూవీలకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వాంటెడ్ మూవీతో అడుగు పెట్టాడు. ఇలా నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు.
హీరోగానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు ప్రభుదేవ. ఒక వైపున దర్శకుడిగా సినిమాలు తీస్తూనే, మరో వైపున హీరోగాను ప్రభుదేవా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. హీరోగా ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. వాటిలో వైవిధ్యభరితమైనదిగా 'భగీర' కనిపిస్తోంది. ఇదో సైకో థ్రిల్లర్ కథ అంటున్నారు.. ప్రభుదేవ ఇందులో సైకోగా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో ప్రభుదేవ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన సరసన ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే అమైరా దస్తూర్ .. గాయత్రిలను ఎంపిక చేశారు. మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకోనున్నారు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ పై ప్రభుదేవ మంచి అంచనాలే పెట్టుకున్నారట. ఈ మూవీతో తనో కొత్త ప్రయోగానికి నాందిపలుకుతున్నానని చెబుతున్నాడు. ఈ మద్య హీరోలు ఎప్పుడూ రొటీన్ పాత్రలే కాకుండా హీరోలు కొత్త గా వెరైటీ పాత్రల్లో నటిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేక పాత్రల్లో కనిపించడం వల్ల రొటీన్ కి భిన్నంగా ఉంటే ప్రేక్షకుల కూడా బాగా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.