దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి బాహుబలి ఫ్రాంఛైజీతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ ని ఆయన బాహుబలి సినిమాలతో దక్కించుకున్నారు. అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజ్ దక్కేలా చేశారు. ఇక బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని ఏకంగా ఆకాశం లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా "రౌద్రం రుధిరం రణం" సినిమాను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

 

భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో వీరులు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల జీవితగాథల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆ మోషన్ పోస్టర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమా నుండి చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఒక టాక్ ఫిల్మ్ నగర్ లో బాగా వైరల్ అవుతోంది.

 

ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో "రౌద్రం రుధిరం రణం" సినిమాను రూపొందిస్తున్నారు కాబట్టి రీసెంట్ గా ఫ్యాన్స్ లో కొంత గందరగోళం అసహనం ఏర్పడిందట. రాజమౌళి సినిమా తీస్తున్నారంటే ఫ్యాన్స్ పెట్టుకునే అంచనాలు ఎవరూ ఊహించరు. అలాంటిది ఇద్దరు హీరోలను పెట్టేసరికి "రౌద్రం రుధిరం రణం" సినిమాలో ఏ హీరో ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాడో అన్న సందేహాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరోల గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారట.

 

ఈ సినిమాలో మా హీరో ఎక్కువ హైలెట్ అవుతాడంటే, మా హీరో ఎక్కువ హైలెట్ అవుతాడంటూ కోల్డ్ వార్ మొదలైందట. అయితే రాజమౌళి ఇద్దరిని సమానంగా చూపిస్తున్నారన్న మాట బాగా వినిపిస్తుంది. అంతేకాదు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇద్దరి హీరోలకంటే కూడా రాజమౌళి అసలు హీరో అంటూ కూడా చెప్పుకుంటున్నారట.    

మరింత సమాచారం తెలుసుకోండి: