హీరోగా నిలుదొక్కుకోవడంతో ఇటీవల నిర్మాత గా కూడా మారి కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ  మీడియం బడ్జెట్ సినిమాలను తీయడం మొదలుపెట్టాడు నేచురల్ స్టార్ నాని. అందులో భాగంగా గత ఏడాది అ! అనే సినిమాను నిర్మించిన నాని ఇటీవల హిట్ ను నిర్మించాడు. అయితే ఈ రెండు సినిమాలను సోలోగా నిర్మించలేదు.. తన స్నేహితురాలు ప్రశాంతి త్రిపురనేని ఈ నిర్మాణం లో భాగమైంది. ఇక ఇటీవల విడుదలైన హిట్ డీసెంట్ టాక్ తో ఫుల్ రన్ లో 5కోట్ల వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.
 
కరోనా వల్ల ఈ సినిమా కు దెబ్బ పడింది లేకుంటే సూపర్ హిట్ అయ్యేదే. ఫలక్ నుమా దాస్ తరువాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యం లో నూతన దర్శకుడు శైలేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దాంతో రేపటి నుండి హిట్ , ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన దైన స్టైల్లో తెలియజేశాడు నాని. రేపు హిట్ ఇంటికే వస్తుంది .. ఇంట్లోనే వుండండి అని ట్వీట్ చేశాడు.
 
సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇదిలాఉంటే హిట్ తో ఎట్టకేలకు కెరీర్ లో మొదటి హిట్ కొట్టిన విశ్వక్ సేన్సినిమా తరువాత పాగల్ లో నటించనున్నాడు. నూతన దర్శకుడు నరేశ్ డైరెక్ట్ చేయనున్న ఈచిత్రంలో  ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుందని టాక్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: