నిధి అగర్వాల్, టబు కి ఒక పోలిక ఉంది. అంతేకాదు ఈ ఇద్దరికి అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం కూడా ఉంది. ఇక నిధీ 2017లో విడుదలైన 'మున్నా మైకెల్' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే డ్యాన్సింగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్ తో నటించి అందరిని బాగా ఆకట్టుకుంది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో 'సవ్యసాచి' సినిమాతో తెలుగులో అక్కినేని హీరో నాగచైతన్య సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నిధీ ఇక తిరిగి ముంబై వెళ్ళిపోవాల్సిందే అనుకున్నారు. కాని మళ్ళీ అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను'లో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా మూడో సినిమా లో ఛాన్స్ అందుకొని అందరికి షాకిచ్చింది.

 

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఫస్ట్ హిట్ ను దక్కించుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో నిధీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి రెండు సినిమాలు దారుణంగా ఫ్లాపయినా కూడా మూడో సినిమాతో సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో నిధీ కి ఇక టాలీవుడ్ లో వరుసగా సినిమాలొస్తాయనుకుంది. కానీ నిధీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. హీరోయిన్ గా ఈ సినిమాలో చేస్తుంది...ఆ సినిమాలో చేస్తుంది అన్నారే తప్ప సెట్స్ మీదకి వెళ్ళింది ఒక్కటీ లేదు. గల్లా అశోక్ సరసన నటిస్తుంది అన్నారు. కాని ఆ సినిమా అప్డేట్ కూడా లేదు.

 

ఇక ఐటెం సాంగ్స్ కోసం కోట్లు గుమ్మరించి స్టార్ హీరోయిన్లను కూడా ఒప్పించే హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి స్టెప్పులు వేయడానికి నిధి ని సంప్రదించారట. అయితే నిధి 60లక్షలు డిమాండ్ చేసిందట. దెబ్బకి నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. నిధికి హీరోయిన్ గా చేస్తేనే అంత ఇవ్వట్లేదు. అలాంటిది కేవలం ఐటమ్ సాంగ్ కోసం అంత ఇవ్వాలా ... అని నిర్మాత వెనక్కి తగ్గాడట. ఈ సినిమాలో నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: