శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అన్న బ్యానర్ కి మంచు మోహన్ బాబు కి టాలీవుడ్ లో ఒక నేం అండ్ ఫేం ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాయి. ఇక మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ అన్న పేరు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి ద్వారా చిత్ర పరిశ్రమకి పరిచయమైన మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా ఎంతటి సక్సస్ ని అందుకున్నారో అందరికి తెలిసిందే.

 

ఇక చిత్ర పరిశ్రమలో వారసుల రాక వాళ్ళ సక్సస్ ఫెల్యూర్ అన్నవి కామన్ గా జరిగేవే. ఏ హీరో అయినా తమ పిల్లలని సక్సస్ ఫుల్ హీరోలుగా చూడాలని, నిలబెట్టాలని అనుకుంటారన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ మంచి స్టార్ డంని సంపాదించుకున్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున, నాగ చైతన్య లు కూడా మంచి సక్సస్ లను అందుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. కాని మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మాత్రం ఆయన సక్సస్ అయినట్టుగా కొడుకులు హీరోలుగా టాలీవుడ్ లో సక్సస్ అవలేదని చెప్పాలి.

 

టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికి మంచు విష్ణుకి మాత్రం బ్లాక్ బస్టర్స్ అందుకోలేకపోతున్నాడు. గత రెండేళ్లుగా విష్ణు నటించిన సినిమాలు రాలేదన్న సంగతి తెలిసిందే. చేసిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతుండటంతో చాలానే గ్యాప్ వచ్చింది. మంచి ప్రాజెక్ట్ తో వద్దామనుకున్నప్పటికి ఏ ప్రాజెక్ట్ సెట్ అవక సతమతమౌతున్నాడు.అయితే ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విష్ణు "మోసగాళ్లు" అనే సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

అయితే విష్ణు మోసగాళ్లు సినిమాను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమాని కేవలం హాలీవుడ్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత హిందీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలోనే ముందు తెలుగులో మోసగాళ్లు సినిమాని రిలీజ్ చేసి ఆ తర్వాత నెల గ్యాప్ లో బాలీవుడ్, హాలీవుడ్ లో రిలీజ్ చేస్తారట. అయితే ఈ విషయంలో ఇప్పుడు నెటిజన్స్ మంచు విష్ణుని బాగా ట్రోల్ చేస్తున్నారట. ఒక్క తెలుగులో చేస్తే సరిపోయోది కదా మిగతా భాషల్లో అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: