ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో పలు ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కొన్నాళ్లపాటు పూర్తిగా లాకౌట్ ప్రకటించడంతో ప్రజలు అందరూ కూడా పూర్తిగా ఇళ్లకు మాత్రమే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. కేవలం అత్యవసర పరిస్థితులు, అలానే ఇంటికి అవసరమైన నిత్యావసరాలు కావాలంటే ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఇక ఈ లాకౌట్ తో ప్రజలు సహా సినిమా ప్రముఖులు కూడా తమ ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది. 

 

ఇక ఎవరికి వారు ఈ ఖాళి సమయంలో రకరకాల వీడియోలు చేయడం, లేదా తమకు నచ్చిన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇకపోతే నేడు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన ఒక వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మ్యాటర్ ఏంటంటే, నేను తొలిసారిగా స్వయంగా నా చేతులతో కేక్ తాయారు చేశాను, అయితే ఇందులో పంచదారకు బదులుగా మాపిల్ సిరప్ వాడాను, అలానే కోకో పొడి వంటివి వేసి ఎంతో కష్టపడి ఈ కేక్ చేశాను, బబుల్స్ రాగానే కేక్ ని దించేసాను, ఎలా ఉందో టేస్ట్ చేయాలి. 

 

అలానే ఆరంజ్ ఫ్లేవర్ తో మరొక కేక్ చేశాను అంటూ నిధి కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ తెలిపింది. ఈ కరోనా మహమ్మారితో నిధి సహా అనేక మంది ప్రముఖులు ఈ విధంగా తమకు తోచిన విధంగా వంటల్లోను అలానే పలు ఇతర విషయాల్లోనూ ప్రయోగాలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ చీపురు పట్టి తమ ఇల్లంతా ఊడ్చిన వీడియో ఎంతో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం నిధి పోస్ట్ చేసిన ఈ కేక్ రెసిపీ పై పలువురు ఆమె ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: