టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రవితేజ, జ్యోతిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హరీష్ శంకర్, ఫస్ట్ మూవీ తో పెద్దగా సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళి రవితేజ తోనే ఆయన తీసిన మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా హరీష్ కు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడం, అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో, దాని తెలుగు రీమేక్ బాధ్యతలను పవన్, హరీష్ కు అప్పగించారు. 

 

అదే తెలుగులో గబ్బర్ సింగ్ గా తెరకెక్కడం, అప్పట్లో అతి పెద్ద సెన్సేషన్ ని అందుకున్న ఆ సినిమా తరువాత హరీష్, జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య తీయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆ సినిమా అంచనాలు అందుకోలేక ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆపై సాయి ధరమ్ తేజ్ తో ఆయన తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సూపర్ హిట్ కొట్టడంతో హరీష్ మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. అనంతరం బన్నీ తో ఆయన తీసిన డీజే యావరేజ్ విజయాన్ని అందుకోగా, ఇటీవల మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆయన తీసిన గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ కొట్టి హరీష్ కు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక అతి త్వరలో తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ తో మరొక సినిమాని తీయనున్నారు హరీష్. 

 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. అయితే ఆ ప్రకటన తరువాత పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా ఆ సినిమాపైనే ఉన్నాయి. ఇక నిన్న హరీష్ శంకర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు పవన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెపుతూ, మీరు మా పవన్ గారితో తీసిన గబ్బర్ సింగ్ మ్యాజిక్ మళ్ళి రిపీట్ అవ్వాలి, తప్పకుండా మీరు పవన్ కు మరొకసారి మంచి హిట్ ఇవ్వాలి, అంతా మీ చేతుల్లోనే ఉంది అని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనపడుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: