అక్కినేని అఖిల్ ఎన్నో రోజులుగా హిట్ కోసం చూస్తున్నాడన్న సంగతి తెలిసిందే. నాగార్జున కుమారుడయిన అఖిల్ కి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. మొదటి సినిమా అఖిల్ నుండి మొన్న వచ్చిన మిస్టర్ మజు వరకు అన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఎలాగైనా ఒక హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. కెరీర్లో నాలుగవ చిత్రాన్ని చేస్తున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

 

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటివరకు ఎనభై శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం లవ్ సీన్స్ ని బ్యాలన్స్ గా ఉంచిందట. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోవడంతో ఈ సీన్స్ అలాగే మిగిలిపోయాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఎంతయినా మరో రెండు మూడు నెలలు ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చు.

 

ఈ నేపథ్యమ్లో అఖిల్ కి టెన్షన్ పెరుగుతుందట. సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదట. అదీ గాక పరిస్థితి అంతా మెరుగు పడ్డాక పూజా హెగ్డే డేట్స్ డేట్స్ దొరుకుతాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ . అదీ గాక ప్రభాస్ తో చేస్తున్నా పాన్ ఇండియా సినిమా సహా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలోనూ నటిస్తుంది.

 

కాబట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అన్నీ కుదిరి షూటింగ్ పూర్తయిన కూడా విడుదల తేదీ దేన్ని ఎంచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది. కరోనా వల్ల ఇప్పటికే వాయిదా పడ్డ ఇతర చిత్రాలన్నీ వరుసలో ముందుంటాయి. అవన్నీ పూర్తయి వచ్చేసరికి అఖిల్ కి పెద్ద సినిమాలతో పోటీ ఏర్పడుతుంది. హిట్ కోసం ఎదురుచుస్తున్న అఖిల్ పెద్ద సినిమాలకి పోటీగా వెళ్లడు. కాబట్టి సోలోగానే వెళ్లాలి. ఇదంతా చూస్తుంటే అఖిల్ సినిమా ఇప్పట్లో విడుదల అయ్యేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: