యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి నుండి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. సాహో అనుకున్న విజయం సాధించకపోవకడంతో ఈ చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ మొత్తం మార్చేసి అయిదు నెలల తర్వాత షూటింగ్ మొదలు పెడితే కరోనా బూచి వచ్చి వాళ్ళని విదేశాల నుంచి వెనక్కి పంపించింది. యూరోప్ లోనే ఈ చిత్రాన్ని షూట్ చేద్దామని అనుకున్నారు కానీ ఇటీవల జార్జియా బెటర్ అని డిసైడ్ అయి అక్కడికి వెళ్లారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు. ఇంకా పేరు ఖరారు ఈ చిత్రానికి 'జాన్' 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

 

ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో షూటింగ్ చేయడమే సాధ్యమయ్యేలా లేదు. లాక్ డౌన్ పూర్తయినా కానీ విదేశీ యాత్రలకి ఇప్పుడప్పుడే పర్మిషన్ రాకపోవచ్చు. కరోనా పరిస్థితులు పోయే దాకా వేరే దేశాలు కూడా పర దేశీయులని ఇప్పట్లో ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఇక్కడే ఎలా పూర్తి చేయాలనే దానిపై తలలు బాదుకుంటున్నారు. స్టోరీ నేపథ్యాన్ని ఇండియాకి మార్చడమా లేక సెట్స్ వేయడమా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటున్న ఈ సమయంలో దసరాకి ఈ సినిమా రావడం కష్టమే అనే అభిప్రాయానికి వస్తున్నారు.  బాహుబలి సినిమాతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాయబోతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: