సీనియర్ హీరోలకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది, ఇమేజ్ ఉంది కానీ కుర్ర హీరోలతో పటీ పడి సినిమాలు చేసి విజయాలు సాధించడం మాత్రం సాధ్యం కావడం లేదు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం అంతగా సాధించడం లేదు. ఒకప్పుడు చూపించిన ఆ జోరు మాత్రం ఇప్పుడు వాళ్లలో కనిపించడం లేదు. ఎప్పుడో ఓసారి వచ్చే విజయాలే కానీ వరస విజయాలను మరిచిపోయి చాలా కాలమే అయిపోయింది. ఇలాంటి సమయంలో కూడా మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకరు. వరుస హిట్స్ తో విక్టరీ ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లు, అలాగే వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. మహేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో మసాలా చేశారు. అలాగే హిందీ హిట్ చిత్రం ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంతో పవన్ తో కలిసి నటించడం జరిగింది. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 సూపర్ హిట్ అందుకుంది.

 

ఎఫ్ 2 చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తుండగా వెంకటేష్ ఈ పార్ట్ లో కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ చిత్రం కొరకు వెంకటేష్ తన రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్. తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు ఆయన డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ ట్రాక్ రెకార్డ్ సైతం ఇప్పుడు బాగుంది. ఆయన గత రెండు చిత్రాలు ఎఫ్ 2, వెంకీ మామ మంచి హిట్స్ అందుకున్నాయి. దీనితో ఆయన పారితోషికం పెంచారని వినికిడి. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ్ రీమేక్ 'అసురన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేయగా, హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: