ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోయిన్లందరిలో స్టార్ గా కొనసాగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిన ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ తో ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

 

అయితే గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే తమిళంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు సూర్య సరసన యముడు దర్శకుడు హరితో కలిసి నటించనుందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. నేను తమిళ సినిమాల్లో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.

 

ఇప్పుడప్పుడే నేను తమిళ సినిమాల్లో నటించబోవడం లేదు. కానీ కొన్ని స్క్రిప్టులు విన్నాను. వాటిల్లో ఇంకా ఏదీ ఫైనలైజ్ అవలేదు. ఫైనల్ అవగానే నేనే మీకు చెప్తాను అప్పటి వరకు ఎలాంటి వార్తలని మీరు నమ్మకండి. కాకపోతే ఈ సంవత్సరం ఖచ్చితంగా తమిళ చిత్రంలో నటిస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తెలుగు, హిందీల్లో బిజీగా మారిన పూజా హెగ్డే కొలీవుడ్ లో కూడా నటించనుంది.

 

నిజానికి పూజా హెగ్డే మొదటగా వెండితెరకి పరిచయం అయ్యింది తమిళ సినిమాతోనే. జీవా హీరోగా వచ్చిన మూగముడి చిత్రంతో పరిచయమైన ఆమెకి ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ అవకాశాలు రాలేదు. తెలుగులో దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత, అల వైకుంఠపురములో వంటి చిత్రాలు ఆమెని స్టార్ హీరోయిన్ ని చేశాయి. ఒకప్పుడు ఐరన్ లెగా అనిపించుకున్న పూజాకి ప్రస్తుతం తెలుగులో ఫుల్ డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: