టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఈ మూవీలో మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.  ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి ప్రభాస్ కెరీర్ పూర్తిగా మార్చివేసింది.  ఈ మూవీ తర్వాత ప్రభాస్ కి అన్నీ కలిసి వచ్చాయి.  డార్లింగ్, మిర్చి మూవీల తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ‘బాహుబలి, బాహుబలి2’ మూవీస్ లో నటించాడు.  ఈ రెండు మూవీస్ ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. ఈ మూవీ భారతీ చలన చిత్ర రంగంలో ఓ చరిత్ర సృష్టించిందనే చెప్పొచ్చు. 

 

జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా తీసినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.  ఆ మద్య భారీ బడ్జెట్ గా  సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ బాలీవుడ్ లో పరవాలేదు.. కానీ ఇతర చోట్ల దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఈ మూవీ తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమా పై జాగ్రత్తగా దృష్టి పెడుతున్నారు.  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

 

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ కథ రెండు కాలాల్లో సాగుతుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ జార్జియాలో షూటింగ్ జరుపుకొని వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో ఓ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడట. ఆయన లుక్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: