వెటకారంగా సెటైర్లు వేయడంలో సంచలన నటి శ్రీరెడ్డి తర్వాతే మరెవరైనా. దక్షిణాది నటులపై, దర్శకులపై ఘాటు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ తార తాజాగా అమలాపాల్ రెండవ పెళ్లిపై సెటైర్ వేశారు. ‘‘బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.’’ అంటూ కాంట్రవర్సి కామెంట్స్ చేసింది. అమలాపాల్.. ఆమె ప్రియుడు భవ్నీందర్ సింగ్ను వివాహం చేసుకున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.అయితే ఆమె కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా ఎక్కడా స్పందించకపోవడంతో వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో వైరలవ్వడంతో అమలాపాల్ స్వయంగా స్పందించి, తనకు వివాహం జరగలేదని, అది కేవలం ఫొటో షూట్కు సంబధించిన చిత్రాలను వివరణ ఇచ్చుకుంది. దీంతో అభిమానుల అనేక అనుమానాలకు తెరపడినట్లయింది. ఇది జరిగి దాదాపు వారం దాటుతోంది. అయితే శ్రీరెడ్డికి కూడా ఈ విషయం తెలియదంటే..మనల్ని మనం అయామకుల్నిగా ఓ సారి అద్దంలో లుక్కేసుకోవాల్సిందే.
శ్రీరెడ్డి వేరే అర్థం వచ్చేలా కామెంట్ చేసిందన్న అభిప్రాయాన్ని అమాలపాల్ అభిమానులు మండిపడుతున్నారు కరోనా నీకెందుకు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరికొంతమంది కరోనా మహమ్మారీ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple