పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటానీ. బాలీవుడ్ లో ధోని బయోపిక్, భాగీ 2, మలంగ్‌ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు దిశా. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘రాధే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మళ్ళీ అవకాశాలు అందిపుచ్చుకోని ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వాళ్లకు కూడా బాగా టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టుల కోసం కుర్రకారు వెయిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. 

 

బ్యూటీ 'అల వైకుంఠపురంలో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' సాంగ్ లోని ఒక బిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ర్యాంప్ మీద అల్లు అర్జున్ వేసే ఈ స్టెప్ కి 'ఇతను ఈ విధంగా డాన్స్ ఎలా చేస్తాడు' అని కామెంట్ పెట్టింది. అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటింటించిన 'అల వైకుంఠపురంలో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి బాలీవుడ్ లో కూడా స్టెప్పులు వేశారు. దిషా పఠానీ పొగుడుతూ చేసిన పోస్ట్‌కు స్పందించిన బన్నీ.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, మంచి సంగీతం వింటే చాలు సహజంగానే డ్యాన్స్ వచ్చేస్తోందని చెప్పుకొచ్చాడు. మీరిచ్చిన కాంప్లిమెంట్‌కు ధన్యవాదాలని పేర్కొన్నాడు. మా అందరిలో ఇలా స్ఫూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలంటూ దిశ రిప్లై ఇచ్చింది.

 

వీరిద్దరి మధ్య సంభాషణ చూస్తుంటే ఫ్యూచర్ లో కలిసి నటిస్తారేమో అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఈ మధ్యే తన 17 ఏళ్ళ సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. గంగోత్రి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు తన సినిమాల ద్వారా బాగా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు ఇంటి పట్టునే ఉంటూ వినోద కార్యక్రమాలు చూసుకుంటూనో, వర్కౌట్లు చేసుకుంటూనో, ఫ్యామిలీతో సరదగా గడపడమో చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దిశా పఠానీ 'అల వైకుంఠపురములో' సినిమాను వీక్షించినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: